ఇది కేవలం జగన్‌ కక్ష సాధింపే

ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో జగన్ కక్ష సాధింపు రాజకీయాలు మరింత తీవ్రమయ్యాయని టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఆరోపించారు.
ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంతో వ్యవస్థలను అడ్డుపెట్టుకుని తెలుగుదేశంపార్టీ నాయకులను వేధిస్తున్నారని ఆయన ట్వీట్‌ చేశారు. ఇందులో భాగమే మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను అక్రమంగా అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. శరత్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని …వెంటనే అతన్ని విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ – APSDRI ద్వారా అక్రమ
కేసులు పెట్టి టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. ”APSDRI ఎందుకు ఏర్పడింది…దాని అసలు లక్ష్యాలేమిటి.?
మూడేళ్లుగా వాళ్ళు పెట్టిన కేసులెన్ని? ఎవరెవరిపై కేసులు పెట్టారు అనే  వివరాలు ప్రభుత్వం బయటపెట్టగలదా? టీడీపీ నేతలను వేధించడానికి సీఐడీని
తన జేబు సంస్థగా మార్చుకున్నట్లే, ఇప్పుడు APSDRI ద్వారా కూడా రాజకీయ కక్షలను తీర్చుకుంటోంద”ని చంద్రబాబు అన్నారు. ఎన్నికల ముంగిట పార్టీ అభ్యర్థులను బలహీన పరిచేందుకే ఈ కుట్రలని అన్నారు. APSDRI బెదిరింపులు, వేధింపులు తట్టుకోలేక వివిధ వర్గాల వ్యాపారులు కోర్టుకు వెళ్లింది వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు. 40 రోజుల్లో ఇంటికి పోయే వైసీపీ ప్రభుత్వానికి అనుబంధ విభాగ సభ్యులుగా పని చేస్తే, అధికారులు
మూల్యం చెల్లించక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు.

Related Articles