మంగళసూత్రం యాడ్ను వెంటనే తొలగించాలని ప్రముఖ డిజైనర్ సవ్యసాచి ముఖర్జిని మధ్యప్రదేశ్కు చెందిన మంత్రి నర్వోత్తమ్ మిశ్రా డిమాండ్ చేశారు. 24 గంటల్లో సదరు యాడ్స్ను తొలగించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే బీజేపీకి చెందిన లీగల్ అడ్వయిజర్ సర్వోత్తమ్ ముఖర్జికి లీగల్ నోటీసు పంపారు. మంగళసూత్ర యాడ్ కోసం సవ్యసాచి ముఖర్జీ తయారు చేసిన యాడ్స్ అసభ్యంగా, హిందూ సమాజాన్ని అవమాన పరిచేలా ఉన్నాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అర్ధనగ్నంగా ఉన్న మహిళలతో పవిత్రమైన మంగళసూత్రం యాడ్ చేయడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయితే సవ్యసాచి మాత్రం సదరు యాడ్స్ను తన ఇన్స్టా నుంచి తొలగించలేదు.