సీనియర్లంతా ఒక్కటయ్యారమ్మ..

పీజీ వైద్య విద్యార్ధిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో పలు ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి. ఆత్మహత్యకు పాల్పడే ముందు రోజు తల్లితో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఫోన్‌లో తన బాధను తల్లితో పంచుకున్నట్లు ఆడియో బయటికి వచ్చింది. ‘ సైఫ్‌ నాతో పాటు చాలా మంది జూనియర్లను వేధిస్తున్నాడు. సీనియర్లు అంతా ఒక్కటిగా ఉన్నారు. పోలీసులతో సైఫ్‌కు నాన్న ఫోన్ చేయించినా లాభం లేకపోయింది. సైఫ్ వేధింపులు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి’ అని ప్రీతి తన తల్లి దగ్గర బాధపడింది. సైఫ్‌పై ఫిర్యాదు చేస్తే సీనియర్లందరూ ఒక్కటై తనను దూరం పెడతారని ఆవేదన చెందింది. ఏదైనా సమస్య ఉంటే తన దగ్గరికి రావాలని హెచ్‌వోడీ ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పింది. ఈ మాటలు విన్న తల్లి.. సైఫ్‌తో మాట్లాడి ఇబ్బంది లేకుండా చేస్తానని కూతురికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ ప్రీతి మరుసటి రోజే ఆత్మహత్యకు పాల్పడింది.

Related Articles