ఈ నెల 21 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల మూడు వరకు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. 21న ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధనతో మొదలైన బ్రహ్మోత్సవాలు… స్వస్తీవాచనం, రక్షాబంధనం. సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోహనతో మొదటి రోజు క్రతువుతు ముగుస్తాయి. ఇక 22న ఉదయం 8గంటలకు అగ్నిప్రతిష్ఠ… 11 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 6.30గం టలకు భేరీపూజ, దేవతాహ్వానంహవనం నిర్వహించనున్నారు. 23న ఉదయం అలంకార, వాహన సేవలకు శ్రీకారం చుడతారు. ఉదయం 9 గంటలకు మత్స్యావతార అలంకార సేవ, వేదపారాయణం నిర్వహించగా.. రాత్రి 7 గంటలకు శేష వాహన సేవ ఉంటుంది. ఇక 24న ఉదయం 9 గంటలకు వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి 7 గంటలకు హంస వాహన సేవ. 25న ఉదయం 9 గంటలకు శ్రీకృష్ణాలంకార సేవ రాత్రి 7 గంటలకు పొన్న వాహన సేవ నిర్వహిస్తారు. 26న ఉదయం 9 గంటలకు గోవర్దన గిరిధారి అలంకార సేవ, రాత్రి 7 గంటలకు సింహ వాహన అలంకార సేవ ఉంటుంది. 27న ఉదయం 9 గంటలకు జగన్మోహిని అలంకార సేవ, రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవ, అనంతరం శ్రీస్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు. 28న ఉదయం 9 గంటలకు శ్రీరామ అలంకార (హనుమంత వాహనం) సేవ, రాత్రి 8 గంటల నుంచి గజవాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం నిర్వహించనున్నారు. మార్చి 1న ఉదయం 9 గంటలకు గరుడ వాహన సేవ, రాత్రి 7గంటల నుంచి దివ్య విమాన రథోత్సవం ఉంటుంది. 2 న ఉదయం 10.30 గంటలకు మహా పూర్ణాహుతి, చక్రతీర్థం, సాయంత్రం 6 గంటలకు శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసన ఉంటుంది. 3న ఉదయం 10 గంటలకు శ్రీస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం.. రాత్రి 9 గంటలకు శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు సమాప్తమవుతాయి. స్వామివారి తిరు కళ్యాణోత్సవం రోజున ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ పట్టు వస్త్రాలు అందజేయనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా.. ఈ నెల 21వ తేదీ నుంచి వచ్చేనెల 3 తేదీ వరకు ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలు, సుదర్శన నరసింహ హోమం, నిత్య కళ్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Related Articles