వరంగల్‌లో మరో కొత్త సచివాలయం

వరంగల్‌లో కొత్త సచివాలయం నేడు ప్రారంభం కానుంది. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సెక్రటేరియట్‌ను ప్రారంభిస్తున్నారు. అదేంటీ, హైదరాబాద్‌లో కొత్త సచివాలయం నిర్మాణం పూర్తయింది కదా.. మరొకటి నిర్మించారని అనుకుంటున్నారా.. అసలు విషయం ఏంటంటే ఈనెల 17న సీఎం కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని బుధవారం నుంచి మూడు రోజుల పాటు వేడుకలను నిర్వహించేందుకు వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా అజంజాహీ మైదానంలో రూ.30 లక్షల ఖర్చుతో సచివాలయం పోలిన ఓ సెట్ వేశారు. అలాగే ఈనెల 18న శివరాత్రి ఉన్న నేపథ్యంలో పట్టణ ప్రజలు ఇక్కడే పూజలు చేసేలా మరో రూ. 30 లక్షలతో భారీ శివలింగం, భక్తులు జాగారం చేసేందుకు గాను భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తు్నారు. ఇవాళ మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయకరావులతో కలిసి ఎమ్మెల్యే ఈ వేడుకలను ప్రారంభించనున్నారు. సెక్రటేరియట్ నమునాతో వేసిన సెట్టింగ్ వరంగల్ తూర్పు నియోజవర్గ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Related Articles