నేడు తారకరత్న అంత్యక్రియలు

ప్రముఖ సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి తారకరత్న భౌతిక కాయానికి టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, బ్రహ్మణి, వైస్సార్‌టీపీ ప్రెసిడెంట్‌ షర్మిల, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, సినీనటుడు అలీ, పలువురు రాజకీయ నేతలు నివాళి అర్పించారు. సోమవారం మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తారకరత్న కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడరు. తారకరత్న మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతిని, బాధను కలిగించిందని అన్నారు. ఆస్పత్రి నుంచి కోలుకుని వస్తారని ఆశించామని, 23 రోజులపాటు మృత్యువుతో పోరాడి చివరికి తమకు దూరమై కుటుంబానికి విషాదాన్ని మిగిల్చారని అన్నారు. ఆయన కుటుంబానికి అందరం అండగా ఉంటామని తెలిపారు. శనివారం రాత్రి బెంగళూరు నుంచి తారకరత్న పార్థివదేహాన్ని హైదరాబాద్‌ లోని నివాసానికి తెచ్చినప్పటి నుంచి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అక్కడే ఉన్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తనకు చెప్పాడని ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు.

Related Articles