కవిత మాజీ ఆడిటర్‌కు బెయిల్‌

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబుకు ఊరట లభించింది. సోమవారం కేసు విచారించిన ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. రూ.2లక్షల పూచీకత్తు చెల్లించడంతోపాటు, పాస్‌పోర్టును అప్పగించాలని జడ్జి నాగ్‌పాల్‌ ఆదేశాలు జారీచేశారు. బుచ్చిబాబును ఫిబ్రవరి 8న కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Related Articles