ఈడీ నోటీసులపై స్పందించిన కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసుల జారీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. లిక్కర్ స్కాంలో తాను చేసేంది ఏమీ లేదని, తాను దేనికి భయపడబోనని తెలిపారు.’ఢిల్లీ లిక్కర్ స్కాంలో నేను చేసింది ఏం లేదు. విచారణకు పూర్తిగా సహకరిస్తా. నేను దేనికి భయపడను. అరెస్ట్ చేస్తే ప్రజల దగ్గరికి వెళతా. నేను ఫోన్లు ధ్వంసం చేయలేదు. అడిగితే ఫోన్లు కూడా ఇస్తా. గతంలో ఈ స్కాంకు సంబంధించి ఆరుగంటల పాటు సీబీఐ అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం ఇచ్చా’ అని ఆమె వివరించారు.

Related Articles