ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో తెలిపింది. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పిళ్లైతో కలిపి కవితనుప్రశ్నించనున్నట్లు సమాచారం.

Related Articles