అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి శనివారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మరోసారి నోటీసులు జారీ చేసింది. గత నెల జనవరి 28వ తేదీన అవినాష్ రెడ్డి హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరైన విషయం తెలిసిందే. తాజాగా, మరోసారి ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు వాట్సప్‌ ద్వారా వైఎస్ అవినాష్‌రెడ్డికి నోటీసులు పంపించారు. ఈ క్రమంలో తనకు నోటీసులు అందిన విషయం వాస్తవమేనని వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ధ్రువీకరించారు. కాగా, ఎంపీ అవినాష్‌రెడ్డికి సీబీఐ అధికారులు రెండోసారి నోటీసులివ్వటం గమనార్హం.

Related Articles