2020లో నా తడాఖా చూపిస్తా

‘అపుడే నన్ను తీసి పారేయకండి… 2020లో నా తడాఖా చూపిస్తాన’ని అంటోంది స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిపీవీ సింధు. ఒలింపిక్స్‌కు సన్నాహాలపై ఆమె టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడారు. గోపీచంద్‌, పార్క్‌ తాయి సాంగ్‌తో ఒలింపిక్స్‌ ట్రైనింగ్‌ ఇప్పటికే ప్రారంభమైంన్నారు. కొత్త ఏడాదిని ఈనెల 7న ప్రారంభం కానున్న మలేషియన్‌ మాస్టర్స్‌తో ప్రారంభిస్తున్నట్లు సింధు తెలిపారు. ఒలింపిక్స్‌ కోసం తీసుకుంటున్న శిక్షణ చాలా కఠినంగా ఉంటుందన్నారు. త్వరలోనే ఒలింపిక్స్‌ క్వాలిఫయ్యర్స్‌ జాబితా రానుందని, అది వచ్చాక.. అసలు శిక్షణ మొదలవుతుందన్నారు సింధు.

Related Articles