ఒకే వేదికపై కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి

రైతులు పండించే ప్రతి వరి గింజనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘వరిదీక్ష’లో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఈ దీక్షకు హాజరైన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు. అంతేకాదు.. ఒకరినొకరు పరస్పరం పలకరించుకున్నారు… కలిసి అభివాదం కూడా చేశారు. ఈ ఇద్దరి కలయికతో అటు రేవంత్, కోమటిరెడ్డి అభిమానుల్లో.. కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వచ్చినట్లయ్యింది. పీసీసీ పదవి తనకు దక్కకపోవడంతో పార్టీ అధిష్టానం పట్ల, స్ధానిక నేతల పట్ల కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే.

Related Articles