నేడు చంద్రబాబు పర్యటన

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బుధవారం తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. ఈనెల 17వ తేదీ వరకూ మూడు రోజులపాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ‘ఇదేం ఖర్మ మన రా ష్ర్టానికి’ కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో బహిరంగసభలు, రోడ్డు షోలు నిర్వహించనున్నారు. అందులోభాగంగా బుధవారం మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి 1.20 గంటలకు బేగంపేట వి మానాశ్రయానికి చేరుకుని, 1.30కి విమానంలో బయలుదేరి, 2.40కు రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన మధురుపూడి, బూరుగుపూడి, కోరుకొండ నుంచి గోకవరం మండలంలోని గుమ్మళ్లదొడ్డి మీదుగా గోకవరం చేరుకుంటారు. 3.30 గంటలకు గోకవరంలోని గ్రామంలోని దేవీచౌక్‌, ఎల్‌ఐసీ ఆఫీసు మీదుగా రోడ్డు షో నిర్వహించి, దేవీచౌక్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలేసి నివాళులు అర్పిస్తారు. అక్కడ నుంచి జగ్గంపేట మం డలంలోని రాజపూడి గ్రామం మీదుగా జగ్గంపేట చేరుకుంటారు. రోడ్డు షో అనంతరం బహిరంగలో పాల్గొని, రాత్రికి జ్యోతుల నెహ్రూ క్యాంపు ఆఫీసులో బస చేస్తా రు. గురువారం పెద్దాపురం నియోజకవర్గంలో, శుక్రవారం అనపర్తి నియోజకవర్గంలోనూ పర్యటిస్తారు.

Related Articles