వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. మొత్తం 18 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి జాబితాను వెల్లడించింది. స్థానిక సంస్థల కోటాలో 9 స్థానాలు, ఎమ్మెల్యే కోటాలో 7 స్థానాలకు, గవర్నర్‌ కోటాలో 2 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేశామని వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సామాజిక సమీకరణాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌ ఈ పేర్లను ఖరారు చేశారని సజ్జల చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు రాజకీయ సాధికారత కల్పించాలన్న లక్ష్యంతో సీఎం జగన్‌ ముందుకు వెళ్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
* స్థానిక సంస్థల కోటా అభ్యర్థులు
స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు ఎంపికైన అభ్యర్థులు 9 మందిలో.. నర్తు రామారావు (శ్రీకాకుళం), కుడిపూడి సూర్యనారాయణ (తూర్పుగోదావరి), వంకా రవీంద్రనాథ్‌ (పశ్చిమగోదావరి), కవురు శ్రీనివాస్‌ (పశ్చిమగోదావరి), మేరుగు మురళీధర్‌ (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు), సిపాయి సుబ్రహ్మణ్యం (చిత్తూరు), పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి (కడప), ఎ. మధుసూదన్‌ (కర్నూలు), ఎస్‌. మంగమ్మ (అనంతపురం) ఉన్నారు.
* ఎమ్మెల్యే కోటా అభ్యర్థులు
ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులుగా ఎంపికైన ఏడుగురిలో.. పెన్మత్స సూర్యనారాయణరాజు (విజయనగరం), పోతుల సునీత (బాపట్ల), కోలా గురువులు (విశాఖపట్నం), బొమ్మి ఇజ్రాయిల్‌ (బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ), జయమంగళ వెంకటరమణ (ఏలూరు), చంద్రగిరి ఏసురత్నం (గుంటూరు), మర్రి రాజశేఖర్‌ (పల్నాడు) పేర్లు ఉన్నాయి.
* గవర్నర్‌ కోటా అభ్యర్థులు
1. కుంభా రవిబాబు (అల్లూరి సీతారామరాజు)
2. కర్రి పద్మశ్రీ (కాకినాడ)

Related Articles