అనపర్తి ఘటనతో జగన్ సర్కార్‌కు శుభం కార్డు!

‘అనపర్తి అరాచక ఘటనతో జగన్‌రెడ్డి ప్రభుత్వానికి శుభం కార్డు పడినట్టే. మొన్నటి వరకు మా పార్టీ 25 సీట్లలో విజయం సాధిస్తుందని అనుకున్నాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది కూడా కష్టమే’ అని వైసీపీ ఎంపీ రఘురామరాజు స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘చంద్రబాబుపై పోలీసులు దాడి చేసినంత పని చేశారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ప్రజలంతా ఏకమవ్వాలి. ఈ ఘటనపై బీజేపీ నేతలు స్పందించాలి. చంద్రబాబు రోడ్‌ షోలకు అనూహ్య ప్రజాదరణ లభిస్తుండడం వల్లే రాష్ట్ర ప్రభుత్వం చీకటి జీవో నంబరు 1 తీసుకువచ్చింది. ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా చంద్రబాబు వెనుదిరగడం లేదు’ అని అన్నారు.

Related Articles