హైదరాబాద్ చేరుకున్న తారకరత్న భౌతికకాయం

నందమూరి తారకరత్న పార్థివ దేహాన్ని హైదరాబాద్‌ చేరుకుంది. నగరంలోని మోకిలలోని తన స్వగృహానికి తారకరత్న భౌతిక కాయాన్ని తరలించారు. తారకరత్నను కడసారి చూసేందుకు నందమూరి కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు నివాసానికి చేరుకుంటున్నారు. ఇక అభిమానుల సందర్శనార్థం రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఫిలిం ఛాంబర్‌లో తారకరత్న పార్థివ దేహాన్ని ఉంచుతారు. సాయంత్రం 5 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. గత నెలలో నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రలో గుండెపోటుకు గురైన తారకరత్న.. దాదాపు 23 రోజుల పాటు ప్రాణాలతో పోరాడారు. తీవ్ర గుండెపోటు కారణంగా బ్రెయిన్‌ డ్యామేజీతో కోమాలోకి వెళ్లిన ఆయన.. శనివారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Related Articles