తారకరత్న మృతిపై ప్రధాని మోడీ సంతాపం

సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న మృతి ఎంతో బాధించిందని ప్రధాని మోడీ అన్నారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. ‘సినిమాలు, ఎంటర్‌టైన్‌రంగంలో తారకరత్న తనదైన ముద్రవేశారు. ఆయన మృతి నన్ను ఎంతో బాధించింది. తారకరత్న కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఓం శాంతి’ అని ప్రధాని ట్వీట్ చేశారు. మరోవైపు తారకరత్న కన్నుమూయడంతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల సినీ నటులు, దర్శకులు విచారం వ్యక్తం చేస్తున్నారు. తారకరత్న లేరన్న విషయం నమ్మలేకపోతున్నామని, మాటలు రావడం లేదని సినీ నటుడు మంచు విష్ణు అన్నారు. తన చుట్టూ ఉన్న వాళ్లను ప్రోత్సహించడంతో పాటు ఎప్పుడూ మంచిని కోరుకుంటారని నిర్మాత అభిషేక్ అగర్వాల్ ట్వీట్ చేశారు. చిన్న వయసులోనే తారకరత్న కన్నుమూయడం ఎంతో బాధిస్తోందని దర్శకులు వక్కంతం వంశీ, హను రాఘవపూడి విచారం వ్యక్తం చేశారు.

Related Articles