నేడు టీడీపీలో చేరనున్న కన్నా

మాజీ మంత్రి, సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ గురువారం టీడీపీలో చేరనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తన అనుచరులు, అభిమానులతో కలిసి ర్యాలీగా టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో విసుగు చెందిన ఆయన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ మారాలని భావించారు. ఈనెల 16న ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. అనంతరం అనుచరులు, అభిమానులతో చర్చించి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

Related Articles