టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు (65) మృతి చెందారు. గత నెల 28న గుండెపోటుతో రావడంతో ఆయన విజయవాడలో చికిత్స తీసుకుంటున్నారు. నెల రోజులుగా మృత్యువుతో పోరాడిన ఆయన ఇవాళ సాయంత్రం మృతి చెందారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన బచ్చుల అర్జునుడు 1995లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2000 నుంచి 2005 వరకు మచిలీపట్నం మున్సిపల్ ఛైర్మన్గా ఉన్నారు. 2014లో కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడిగా ఉన్న ఆయన 2017లో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈనెల 29తో బచ్చుల అర్జునుడు ఎమ్మెల్సీ పదవీకాలం ముగియనుంది.
Related Articles
పోలీసుల అదుపులో ప్రత్తిపాటి కొడుకు
- February 29, 2024
నేడు టీడీపీలో చేరనున్న కన్నా
- February 23, 2023
23న టీడీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ
- February 20, 2023
టీడీపీలోకి మహాసేన రాజేష్
- February 17, 2023
అయ్యన్న పాత్రుడికి ఊరట
- November 9, 2022