ప్రేమోన్మాది వేధింపులకు మరో యువతి ఆత్మహత్య..

కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్ధిని ప్రీతి మృతి ఘటన మరవక ముందే మరో ఇంజనీరింగ్ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమోన్మాది వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన నర్సంపేటలో సంచనలం రేపుతోంది. ప్రేమోన్మాది రాహుల్ తరచూ వేధింపులకు గురి చేయడంతో యువతి రక్షిత వేధింపులు భరించలేక వరంగల్‎లోని తమ బంధువుల ఇంట్లో ఫ్యాన్‎కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నర్సంపేటలోని ఓ ఇంంజనీరింగ్ కళాశాలలో థర్డ్ ఇయర్ చదువుతోంది రక్షిత. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రక్షిత మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ కేసుపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Related Articles