టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో ఆఖరిదైన నాలుగో టెస్టులో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సిరీస్‌లో ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమ్‌ఇండియా ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ను ఓడించి డబ్ల్యూటీసీ ఫైనల్‌ పోరుకు అర్హత సాధించాలని చూస్తుంది. అయితే మూడో టెస్టు విజయం ద్వారా ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్తు ఖరారు చేసుకున్న కంగారూలు అదే ఊపు కొనసాగించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. స్టేడియంలో ఇరు దేశాల ప్రధానమంత్రులు సందడి చేశారు. నాలుగోటెస్టు తొలిరోజు ఆట చూసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌తో కలిసి హాజరయ్యారు.

Related Articles