ఆసీస్‌దే మూడో టెస్టు

బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. భారత్ నిర్ధేశించిన 76 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ కోల్పోయి చేధించింది. ఉదయం ఆట ప్రారంభమైన వెంటనే అశ్విన్ బౌలింగ్‌లో ఉస్మాన్ కవాజా (0) ఔటయ్యాడు. ట్రావిస్ హెడ్‌(49), లబూషేన్ (28) నిలకడగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. 88 పరుగుల లోటుతో రెండో ఇన్సింగ్స్ ఆడిన భారత్‌ను 163 పరుగులకే ఆలౌట్ చేసిన సంగతి తెలిసిందే. పుజారా(59), శ్రేయస్ అయ్యర్(26), రాణించారు. ఆసీస్ బౌలర్ లైయన్ ఏకంగా 8 వికెట్లు తీసి భారత్‌ను దెబ్బకొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 197 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకు ఆలౌటైంది.

Related Articles