హాకీ: 49 ఏళ్ళ తరవాత…

టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు 49 ఏళ్ళ తరవాత ఒలింపిక్స్‌ సెమీస్‌కు దూసుకెళ్ళింది. క్వార్టర్స్‌లో గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన పోరులో మన్‌ప్రీత్ సేన 3-1 తేడాతో విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో భారత జట్టు ఈ నెల 3న బెల్జియంతో తలపడుతుంది. ఒలింపిక్స్‌లో భారత జట్టు సెమీస్‌కు వెళ్లడం 49 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారిగా 1972లో భారత జట్టు ఒలింపిక్ సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఎప్పుడూ భారత జట్టు క్వార్టర్స్ దాటలేదు. 1980 ఒలింపిక్స్‌లో భారత జట్టు స్వర్ణం సాధించినప్పటికీ ఆ ఎడిషన్‌లో సెమీ ఫైనల్ స్టేజ్ లేదు.

Related Articles