నందమూరి తారకరత్న పార్థివ దేహాన్ని హైదరాబాద్ చేరుకుంది. నగరంలోని మోకిలలోని తన స్వగృహానికి తారకరత్న భౌతిక కాయాన్ని తరలించారు. తారకరత్నను కడసారి చూసేందుకు నందమూరి కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు నివాసానికి చేరుకుంటున్నారు. ఇక అభిమానుల సందర్శనార్థం రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఫిలిం ఛాంబర్లో తారకరత్న పార్థివ దేహాన్ని ఉంచుతారు. సాయంత్రం 5 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. గత నెలలో నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో గుండెపోటుకు గురైన తారకరత్న.. దాదాపు 23 రోజుల పాటు ప్రాణాలతో పోరాడారు. తీవ్ర గుండెపోటు కారణంగా బ్రెయిన్ డ్యామేజీతో కోమాలోకి వెళ్లిన ఆయన.. శనివారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
Related Articles
‘పుష్ప’ నటుడు జగదీశ్ అరెస్ట్
- December 6, 2023
స్వగ్రామానికి చేరుకున్న ప్రీతి మృతదేహం..
- February 27, 2023
కాసేపట్లో ఫిల్మ్చాంబర్కు తారకరత్న పార్థివదేహం
- February 20, 2023
మహిళ కిడ్నాప్.. గ్యాంగ్ రేప్
- February 20, 2023
నేడు తారకరత్న అంత్యక్రియలు
- February 20, 2023
తారకరత్న మృతిపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు
- February 20, 2023
తారకరత్న మృతిపై ప్రధాని మోడీ సంతాపం
- February 19, 2023