28న కేసీఆర్‌ బహిరంగ సభ

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వేడెక్కుతున్నాయి. చాలా తక్కువ కాలంలో మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుండటంతో అన్ని పార్టీలు కేవలం రెండు రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేసే పరిస్థితి కన్పిస్తోంది. తుది జాబితా మూడు రోజుల్లో ప్రకటించేలా ఉన్నాయి పార్టీలు. మెజారిటీ సంఖ్యలో అభ్యర్థులను ముందే ప్రకటించి అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ముందుంది. ఇవాళ మీట్‌ ది ప్రెస్‌తో కేటీఆర్‌ హీట్ పెంచారు. ఇక వచ్చేవారం నుంచి ఆయన గ్రేటర్‌ పరిధిలో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ఈ నెల 22 నుండి కుత్బుల్లాపూర్ నుండి కేటీఆర్ రోడ్డు షోలు ప్రారంభమవుతాయి. ఊహించినట్లే కేసీఆర్‌ కేవలం ఒకే ఒక బహిరంగ సభలో మాట్లాడుతారు. ఈనెల 28న ఎల్బీ స్టేడియంలో టీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసే బహిరంగసభలో కేసీఆర్‌ ప్రసంగిస్తారు.

Related Articles