వైఎస్ వివేకా కేసులో మరో ట్విస్ట్

తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. అయితే.. ఇప్పటికే ఈ కేసును సీబీఐకి బదిలీ చేయగా.. ఐదుగురు నిందితులను అధికారులు అరెస్టు చేశారు. అయితే.. ఐదుగురిలో ప్రధాన నిందుతుడైన సునీల్ యాదవ్ బెయిల్ కోసం న్యాయస్థానానికి అప్పీల్ చేసుకున్నాడు. అయితే.. వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ కీలక పాత్ర పోషించాడని ఆరోపిస్తోన్న ఆయన కుటుంబసభ్యులు.. బెయిల్ ఇవ్వొద్దని న్యాయస్థానాన్ని కోరుతున్నారు. ఈ మేరకు వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ.. తెలంగాణ హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. వైఎస్ వివేకా హత్య తర్వాత నిందితుల వల్ల తాను, తన కూతురు ఎంతో మానసిక క్షోభ అనుభవించామని పిటిషన్‌లో సౌభాగ్యమ్మ పేర్కొన్నారు. బెయిల్ ఇవ్వటం వల్ల కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తారమని.. సాక్ష్యాలను తారుమారు చేస్తామని అనుమానం వ్యక్తం చేశారు.

Related Articles