లోకేష్ పాదయాత్రకు వెళ్లొద్దు!

శ్రీకాళహస్తిలో జరిగే లోకేశ్‌ పాదయాత్రకు వెళ్లవద్దంటూ ఓ వలంటీరు ఇంటింటికీ వెళ్లి ప్రజలను వేడుకున్న తీరు చర్చనీయాంశమైంది. యువగళం పాదయాత్ర శుక్రవారం శ్రీకాళహస్తిలో సాగింది. పాదయాత్రకు ప్రజలు పెద్దఎత్తున వెళతారన్న ఆందోళన అధికార పార్టీలో మొదలైంది. దీంతో 20వ వార్డులోని కైలాసగిరి కాలనీలో సాయి అనే వలంటీరు ఇంటింటికీ వెళ్లి పాదయాత్రకు వెళ్లొద్దంటూ వేడుకున్నారు. అయితే.. ‘ఎందుకు వెళ్లకూడదు.. లోకేశ్‌ పాదయాత్రపై ఎందుకంత భయం?’.. అంటూ కొందరు నిలదీశారు. ‘మీకు అన్ని పథకాలూ ఇంటికి చేరుస్తున్నాం కదా ఎందుకు వెళుతున్నారు’ అంటూ వలంటీరు ప్రాధేయపడుతున్న మొత్తం సంభాషణను వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో చర్చనీయాంశమైంది.

Related Articles