లోకేష్ పాదయాత్రలో ఊహించని సీన్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రస్తుతం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. లోకేష్ పాదయాత్రలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పాదయాత్ర సందర్భంగా స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. నారా లోకేష్ పాదయాత్రకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు, కొందరు జనసైనికులు స్వాగతం పలికారు. చంద్రబాబు, లోకేష్‌తో పాటూ పవన్ కళ్యాణ్ ఫోటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీడీపీ, జనసేనలు కలిసి పోటీచేయాలని అనే కోరిక కార్యకర్తల్లో కూడా బలంగా ఉందని కొందరు ఈ ఫోటోలపై కామెంట్ చేస్తున్నారు.

Related Articles