మేం గెలిస్తే రూ. 20,000 ఇస్తాం…

 

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే వరద బాధితులకు ఇంటికి రూ. 20 వేలు ఇస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వరద నష్టం ఎంత జరిగి ఉంటే అంత మొత్తం ఇస్తామని చెప్పారు. నష్టపోయిన కార్లు, బైక్‌లు ఇప్పిస్తామన్నారు. జనసేనతో పొత్తు గురించి బీజేపీలో చర్చ జరగలేదన్నారు. పొత్తులపై జనసేన నుంచి కూడా ఎలాంటి ప్రతిపాదనలు రాలేదన్నారు. ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు.

Related Articles