సీఎం కొండగట్టు పర్యటన వాయిదా

సీఎం కేసీఆర్ కొండగట్టు అంజన్న పర్యటన రేపటికి వాయిదా పడింది. స్వామి వారి దర్శనానికి నేడు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున.. మంగళవారం పర్యటనను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. కొండగట్టు ఆలయ అభివృద్దికి ప్రభుత్వం ఇటీవల రూ.100 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బడ్జెట్‌లోనూ నిధులు కేటాయించారు. సీఎం కేసీఆర్ రేపు ఆలయానికి చేరుకుని అంజన్న క్షేత్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మాస్టర్ ప్లాన్‌ రూపకల్పనపై అధికారులతో చర్చిస్తారు.

Related Articles