నందమూరి తారకరత్న భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, మురళీమోహన్, శివాజీరాజా, అలీ పలువురు తారకరత్న పార్ధివదేహానికి నివాళి అర్పించారు. తారకరత్న భార్య సతీమణి అలేఖ్యా రెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబానికి దగ్గరి బంధుత్వం ఉన్న సంగతి తెలిసిందే. దీంతో విజయసాయిరెడ్డి దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. ఈ క్రమంలో తారకరత్నకు నివాళులు అర్పించేందుకు చంద్రబాబు కూడా కుటుంబంతో కలిసి అక్కడికి వచ్చారు. విజయసాయిరెడ్డి, చంద్రబాబులు పక్క, పక్కన కూర్చుని కొద్దిసేపు మాట్లాడుకున్నారు. విజయసాయిరెడ్డి, చంద్రబాబు ఫోటోను ట్వీట్ చేసి నిర్మాత బండ్ల గణేష్ చేసిన ట్వీట్పై దుమారం రేగుతోంది. ‘నా ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఈ విధంగా కూర్చొని మాట్లాడను, అవసరం వస్తే అక్కడ నుంచి వెళ్ళిపోతా అది నా నైజం. అత్యంత బాధాకరమైన విచిత్రం.. జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి…..!!!’ అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.
Related Articles
ఇది కేవలం జగన్ కక్ష సాధింపే
- February 29, 2024
అబ్బాయి కిల్డ్ బాబాయ్
- February 24, 2023
పట్టాభిని కిడ్నాప్ చేశారు..
- February 21, 2023
నేనేం పాకిస్థాన్ నుంచి వచ్చానా..
- February 18, 2023
వైసీపీ.. రాష్ట్రానికి పట్టిన శని..
- February 17, 2023
ప్రొద్దుటూరు కోర్టుకు బండ్ల గణేష్
- February 16, 2023