పట్టాభిని కిడ్నాప్ చేశారు..

గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌పై వైసీపీ శ్రేణుల దాడి, హింసాత్మక ఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డీపీపీకి లేఖ రాశారు. టీడీపీ నేతలు దొంతు చిన్నా, పట్టాభి భద్రతకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ గూండాలకు పోలీసులు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు ఉందని, వైసీపీ శ్రేణులు దాడులు చేస్తుంటే పోలీసులు మౌనంగా చూస్తున్నారని మండిపడ్డారు. గన్నవరంలోని టీడీపీ ఆఫీస్‌పై వైసీపీ రౌడీలు దాడి చేసి ధ్వంసం చేశారని, అక్కడ ఉన్న పలు వాహనాలకు నిప్పు పెట్టారన్నారు. దొంతు చిన్నాకు చెందిన పలు వాహనాలకు నిప్పు పెట్టారని, పట్టాభిని కొందరు వ్యక్తులు కిడ్నాప్‌ చేశారని ఆరోపించారు. పట్టాభిని పోలీసులు అరెస్ట్‌ చేశారా?.. లేక ఎవరైనా కిడ్నాప్‌ చేశారా?… నిందితులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా గన్నవరంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. దీంతో పోలీసులు 144 సెక్షన్‌ విధిస్తూ.. పోలీస్‌ యాక్ట్‌ 30 అమలు చేస్తున్నారు. గన్నవరంలో దాడుల నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. టీడీపీ, వైసీపీ కార్యాలయాల దగ్గర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related Articles