నేనేం పాకిస్థాన్ నుంచి వచ్చానా..

‘నేనేమన్నా పాకిస్థాన్‌ నుంచి వచ్చానా? వేరే దేశానికి పారిపోతున్నానా? నన్నెందుకు అడ్డుకుంటున్నారు? ఎన్నో అవమానాలు భరించి ఇక్కడకు వచ్చా. జగ్గంపేట, పెద్దాపురంలో సహకరించిన పోలీసులు.. అనపర్తిలో ఎందుకు అడ్డుచెప్పారు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిలదీశారు. పోలీసుల అడ్డంకులు, ఆంక్షలు ఛేదించుకుని కాలినడకన శుక్రవారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి చేరుకున్న చంద్రబాబు అక్కడ బహిరంగ సభలో ప్రసంగించారు. పోలీసులకు భయపడి నేను వెనక్కి వెళ్లిపోతే మిమ్మల్ని బతకనిస్తారా అని అన్నారు. సైకో సీఎం పోలీసుల మెడపై కత్తి పెట్టి ఇలాంటి పనులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు కూడా సంఘ విద్రోహుల్లా మారారని అన్నారు. ఇదే యూనిఫాంలో రేపు నా దగ్గర పనిచేయాల్సి ఉంటుంది గుర్తు పెట్టుకోండి అని పోలీసులను హెచ్చరించారు. ఈరోజు ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలను వ్యతిరేకించి అనపర్తి మార్చ్ చేయాల్సి వచ్చిందన్నారు. ఎవరైనా నా మైక్ దగ్గరకొస్తే ఖబడ్డార్ అని అన్నారు. చట్ట విరుద్ద చర్యలకు పాల్పడిన వారిని తాము అధికారంలోకి వచ్చాక జైలుకు పంపుతామని హెచ్చరించారు.

Related Articles