TSPSC ఛైర్మన్‌గా బి జనార్ధన్‌ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC)ఛైర్మన్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బి జనార్ధన్‌ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయన ప్రస్తుతం వ్యవసాయ విభాగంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉన్నారు. సభ్యులుగా మరో ఏడుగురుని నియమించారు. వారు:
రామావత్‌ ధన్‌ సింగ్‌ (రిటైర్డ్‌ ఇంజినీరింగ్‌ ఛీఫ్‌) బి లింగారెడ్డి (సీబీఐటీ ప్రొఫెసర్‌)
కోట్ల అరుణకుమారి (స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌)
సుమిత్రా ఆనంద్‌ తనోబా (తెలుగు భాష పండితులు)
కరణం రవీందర్‌ రెడ్డి (రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి) ఆరవెళ్ళి చంద్రశేఖర రావు (ఆయర్వేదిక్‌ డాక్టర్‌)
ఆర్‌ సత్యనారాయణ (జర్నలిస్ట్‌)

ముఖ్యమంత్రి ప్రతిపాదనల మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు.

Related Articles