సీపీఐ ‘చలో విజయవాడ’ భగ్నానికి పోలీసుల యత్నం

జగనన్న ఇళ్లు, టిడ్కో ఇళ్ల లబ్దిదారులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈరోజు ‘చలో విజయవాడ’కు సీపీఐ పిలుపునిచ్చింది. ధర్నా చౌక్‌లో మహాధర్నా‌ చేపడుతున్నట్లు సీపీఐ ప్రకటించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు చలో విజయవాడ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు యత్నిస్తున్నారు. విజయవాడ రాకుండా వివిధ జిల్లాల్లో సీపీఐ నేతలను అదుపులోకి తీసుకున్నారు. మరికొన్ని చోట్ల ‌నేతలను గృహనిర్బంధం చేస్తున్నారు. అయితే పోలీసులు, ప్రభుత్వ చర్యలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. టిడ్కో ఇళ్లు అప్పగించాలని, జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం కోసం ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Related Articles