వైసీపీ ఎమ్మెల్యే హఠాన్మరణం

కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య ఆదివారం ఉదయం కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటసుబ్బయ్య కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో చికిత్స పొంది మునిసిపల్ ఎన్నికల ముందు డిశ్చార్జ్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలోనూ ఆయన చురుగ్గా పాల్లొన్నారు. అయితే మళ్లీ అనారోగ్యానికి గురవ్వడంతో ఆయనను కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఎమ్మెల్యే కన్నుమూశారు.

Related Articles