కొనసాగుతున్న అఖిల పక్ష సమావేశం

దళిత ఎంపవర్ మెంట్ సమావేశం ప్రగతి భవన్‌లో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు అధ్యక్షతన జరుగుతున్న ఈసమావేశంలో ప్రజా ప్రతినిధులు,పలు పార్టీల నేతలు పాల్గొంటున్నారు. రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీల సంక్షేమం, వయో వృద్దుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్.,
మధిర ఎమ్మెల్యే కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీ ఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి, ఎం ఐ ఎం పార్టీ యాకుత్ పుర ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి పాల్గొన్నారు.
ఇంకా పెద్దపల్లి ఎంపి వెంకటేష్ నేత బొర్లకుంట, నాగర్ కర్నూల్ ఎంపి పోతుగంటి రాములు, వరంగల్ ఎంపి పసునూరి దయాకర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొంటున్నారు.

Related Articles