9 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌ జారీ

తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల అయింది. ఏపీలో మూడు స్థానాలు, తెలంగాణలో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఏపీలో చిన్న గోవింద రెడ్డి దేవసాని, మొహమ్మద్‌ అహ్మద్‌ షరీఫ్‌, సోము వీర్రాజుల ఎమ్మెల్సీ పదవీ కాలం మే 31న ముగిసింది. ఇక తెలంగాణలో ఆకుల లలిత, మొహమ్మద్‌ ఫరీదుద్దీన్‌, గుత్తా సుఖీందర్‌ రెడ్డి, విద్యాసాగర్‌ నేతి, వెంకటేశ్వర్లు బోదకుంటి, కడియం శ్రీహరి పదవీకాలం జూన్‌ మూడవ తేదీన ముగిసింది. వీరి స్థానాల భర్తీనికి షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది.

నవంబర్‌ 9న నోటిఫికేషన్‌ విడుదల
నామినేషన్లు వేసేందుకు చివరి తేదీ నవంబర్‌ 16
నామినేషన్ల స్ర్కూటినీ నవంబర్‌ 17
నామినేషన్ల ఉసంహరణకు చివరి తేదీ నవంబర్‌ 22
ఎన్నికలు నవంబర్‌ 29న
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌
ఓట్ల కౌంటింగ్‌… అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి

Related Articles