పాపి గద్దెనెక్కి పాప్ సాంగ్ పాడితే …

మాన్సాస్‌ ట్రస్ట్‌ విషయంలో హైకోర్టు తీర్పు తరవాత వైకాపా, టీడీపీల మధ్య విమర్శల జోరు పెరిగింది. కోర్టు తీర్పు తరవాత మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు పెద్దగా ఆరోపణలు చేయలేదు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం పనిచేస్తే చాలని అన్నారు. అయితే వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి అశోక్‌గజపతి రావుపై తాజాగా ఆరోపణలు గుప్పించారు. 115 ఎకరాలను దొంగ జీవో సాయంతో అమ్ముకున్నారని ఆరోపించారు. అలాగే మరో జీవోతో 500 ఎకరాల అమ్ముకున్నారన్నారు. దీనికి టీడీపీ చాలా ఘాటుగా స్పందించింది. ‘ఆఖరికి నువ్వు కూడా అశోక గజపతి రాజు గారిని అనేవోడివి అయిపోయావ్‌. పాపి గద్దె ఎక్కి పాప్‌ సాంగ్‌ పాడితే ఇలాగే ఉంటుంది. ఛీఛీ’ అంటూ ట్వీట్‌ చేసింది.

Related Articles